జగన్ సంతాప సందేశం!

ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్ చేసి చూస్తే, అదేదో జగన్ ఎవరికో సంతాప సందేశాన్ని తెలియజేస్తున్న కార్యక్రమంలా అనిపించడం ఖాయం. ఎందుకంటే, మేనిఫెస్టో విడుదల కార్యక్రమం అంటే, ఆ పార్టీ నాయకుడిలో ఎంత ఉత్సాహం వుండాలి? ఎంత ఆత్మవిశ్వాసం ప్రతిఫలించాలి? ఈ నాయకుడు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేరుస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగేలా వుండాలి. కానీ, జగన్‌లో అవేవీ కనిపించలేదు. ఏదో మేనిఫెస్టో విడుదల చేశామంటే చేశాం.. జనం నమ్మితే నమ్మారు లేకపోతే లేదు.. ఓట్లు వేస్తే వేశారు లేకపోతే లేదు అన్నట్టుగా ముఖ కవళికలు వున్నాయి తప్ప ఎంతమాత్రం జోష్ కనిపించలేదు. జగన్ ఇలా తద్దినం పెట్టినట్టుగా మేనిఫెస్టో చదవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఏపీలో వార్ వన్ సైడ్.. అది కూడా టీడీపీ సైడ్ అయిపోయిందని జగన్‌కి ఇప్పటికే అర్థమైంది. ఇప్పుడు తాను, తన పార్టీ వాళ్ళు పడుతున్న తంటా అంతా ఎందుకూ పనికిరాదని ఆయనకి అర్థమైపోయింది. అందుకే ఆగిపోయే పెళ్ళికి మంత్రాలెందుకన్నట్టుగా మేనిఫెస్టో కార్యక్రమాన్ని ముగించారు.