నా భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉంది..

ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డిని విచారణ జరిపి పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. అయితే ఇప్పుడు గంగిరెడ్డి భార్య మాళవిక చేస్తున్న ఆరోపణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని.. ఆయన్ను ఎన్ కౌంటర్ చేయాలని  ప్లాన్ చేస్తున్నారని అంటుంది. అంతేకాదు తన భర్త గంగిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని జరిగిన ప్రభుత్వందే బాధ్యత అని ఆమె డిమాండ్ చేస్తుంది. తన భర్తను చంద్రబాబు టార్గెట్ చేశారని.. అందుకే పోలీసులు ఆయన్ను వెంటాడి వేధించారని.. చంద్రబాబు వల్ల గంగిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ గతంలో గవర్నరుకు లేఖ కూడా ఇచ్చామని అని చెప్పారు. అయితే పోలీసుల గంగిరెడ్డిని అరెస్ట్ చేసిన వారం రోజుల తరువాత ఆయన భార్య మాళవిక మీడియా ముందుకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు గంగిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తరువాత ఎన్ కౌంటర్ చేయడమనేది అసాధ్యం. అలాంటప్పుడు ఆమె చేసే వాదనలో ఎలాంటి అర్ధం లేదు. మరి ఆమె ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుందో.. ఈమె ఇలా ఆరోపణలు చేయడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇంటర్ పోల్ సహాయంతో గంగిరెడ్డిని మారిషన్ లో పట్టుకున్న సంగతి విదితమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu