ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం

అహ్మదాబాద్ లో  విమానం కుప్పకూలి కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవక ముందే  ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు మరణించారు.   డెహ్రాడూన్ నుంచి   కేదార్‌నాథ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో మార్గమధ్యంలో  కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు 

డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ ప్రాంతాల మధ్య కుప్పకూలింది. ఆ హెలికాప్టర్ లో పైలట్ సహా ఆరుగురు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాద సమాచరం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.