ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం
posted on Jun 15, 2025 9:41AM

అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలి కూలి 274 మంది మరణించిన దుర్ఘటన మరవక ముందే ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు మరణించారు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ ఉదయం ఐదున్నర గంటల సమయంలో మార్గమధ్యంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు
డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు బయలుదేరిన హెలికాప్టర్ త్రిజూగీనారాయణ్, గౌరీకుండ్ ప్రాంతాల మధ్య కుప్పకూలింది. ఆ హెలికాప్టర్ లో పైలట్ సహా ఆరుగురు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ ప్రమాద సమాచరం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.