అనుష్కకి అదేషాక్ తగులుతుందా..?



సినీ పరిశ్రమలో  హీరోలూ తమ సినిమాల్లో వచ్చిన లాభాల్లో వాటా కావాలని అడగటం పరిపాటి. ఇప్పుడు హీరోయిన్ లు కూడా కాస్త తెలివిమీరి పోయారు. వాళ్లకు కూడా సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా అడుగుతున్నారు. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న అనుష్క కూడా ఇదే దారిపట్టింది. తను ఆర్య జంటగా నటిస్తున్న సైజ్ జీరో సినిమా పై ఇప్పటికే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాకి గాను అనుష్క పారితోషికానికి బదులు సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లో వాటా కావాలని అడుగుతుందట. గతంలో ఛార్మి కూడా జ్యోతి లక్ష్మీ సినిమాకి ఇలాగే చేసి చేతులు కాల్చుకుంది. మరి సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఏదైనా అటూ ఇటూ జరిగితే అనుష్క పరిస్థితి కూడా అలాగే అవుతుందా చెవులు కొరుక్కుంటున్నారు.