"శక్తిమాన్‌" జ్ఞాపకంగా..

కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన పోలీస్ గుర్రం శక్తిమాన్‌కు గుర్తుగా డెహ్రాడూన్‌లో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని పోలీస్ లైన్స్‌ ప్రాంతంలో జూన్‌లో శక్తిమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ధ్యాన్‌ సింగ్ నేగి అనే శిల్పి శక్తిమాన్ విగ్రహాన్ని రూపొందించనున్నారు. శక్తిమాన్ 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండగా, ఆ విగ్రహాం 9 అడుగుల ఎత్తుంటుంది. ఇప్పటికే శక్తిమాన్ జ్ఞాపకర్థం పోలీస్ లైన్స్ వద్ద నిర్మాణంలో ఉన్న పెట్రోల్ పంప్‌కు శక్తిమాన్ పేరు పెట్టారు. శక్తిమాన్ జ్ఞాపకాలు ఎప్పుడూ తమ గుండెల్లో పదిలంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu