సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్
posted on May 27, 2025 7:57PM

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు ఇండియన్ రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది. థర్డ్ AC ధర ₹3600, సెకండ్ AC ₹4800, ఫస్ట్ AC ₹6వేలు వరకూ ఉండొచ్చు. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న మూడవ ప్రీమియం రైలు.
ఈ మార్గంలో ఇప్పటికే రాజధాని ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్లు నడుస్తున్నాయి. ఈ రైలును రాత్రి ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తద్వారా ప్రయాణీకులు నిద్రపోతున్నప్పుడు కూడా తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్ వరకు దాదాపు 1667 కి.మీ దూరాన్ని కేవలం 20 గంటల్లోనే చేరుకుంటుంది.