సత్యం కేసు తీర్పు: రామలింగరాజు దోషి
posted on Apr 9, 2015 11:24AM

సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు తుది తీర్పు గురువారం నాడు వెలువరించింది. ఈ కేసులో రామలింగరాజు సహా మిగతా నిందితులపై నేరం రుజువైంది. రామలింగరాజును ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సత్యం సంస్థ మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణ రాజు, ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వడ్లమాని శ్రీనివాస్, ఆ సంస్థ ఆడిటర్స్ యస్. గోపాల కృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్ తదితరులను దోషులుగా కోర్టు పేర్కొంది. క్రిందటి సంవత్సరం అక్టోబరులోనే తుది తీర్పు ప్రకటించవలసి ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన తీర్పు మూడుసార్లు వాయిదా వేశారు. ఈ కేసులో దోషులుగా నిరూపణ అయిన రామలింగరాజుతో సహా మిగతా ముద్దాయిలందరూ గురువారం నాడు కోర్టుకు హాజరయ్యారు.