రాజుగారికి ఆశాభంగం
posted on Mar 19, 2014 12:58PM
.jpg)
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతోపాటే క్యాడర్ కూడా వెన్నంటి వస్తుంది.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా మూకుమ్మడిగా తనకే జయజయధ్వనాలు పలుకుతారని భావించిన రాజావారికి ఆశాభంగమైంది. టీడీపీలో చేరిన తర్వాత తొలిసారి పాతపట్నం నియోజకవర్గానికి వచ్చిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు తనవారనుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొహం చాటేశారు.. మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచీ పూర్తిస్థాయిలో స్వాగత సత్కారాలు లభించలేదు. ఎల్.ఎన్.పేట నుంచి నిర్వహించిన స్వాగత ర్యాలీ చప్పగా సాగింది. టీడీపీలో తన అధిపత్యం నిరూపించేందుకు శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పటికే అక్కడ టీడీపీలో రెండు వర్గాలు ఉండగా.. ఒక వర్గానికి చెందినవారే ఈ కార్యక్రమంలో కనిపించారు. దీంతో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి ఈసారి తనను గట్టెక్కించేస్తారు అనుకున్న శత్రుచర్ల ఆశలు అడియాసలని మొదటిరోజే తేలిపోయింది. రెంటికీ చెడ్డ రేవడిలా ఆయన పరిస్థితి తయారైంది.