మా ఉద్యమం ఆగలేదు..విరామం మాత్రమే

హైదరాబాద్‌ : ఉద్యమ స్వరూపాన్ని మర్చేందుకు మాత్రమే సమ్మెకు తాత్కాలిక విరామం ఇచ్చినట్టు టీఎన్జీవోలు పేర్కొన్నారు. తమ ఉద్యమం ఆగలేదని, అలా అనుకుంటే ప్రభుత్వం పప్పులో కాలేసినట్టేనని వారు పేర్కొన్నారు. నాంపల్లిలో ఈరోజు టీఎన్జీవోల సమావేశం జరిగింది. రెండో ఎస్సార్సీకి అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు అందాల్సిన కరవు భత్యాన్ని వెంటానే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ తప్ప తమకు ఏదీ ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu