సైనా.. మళ్ళీ నంబర్‌వన్

 

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్ళీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుకు చేరుకుంది. గురువారం నాడు బీడబ్ల్యూఎఫ్ విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో సైనా నెహ్వాల్ అగ్రస్థానంలో వుంది. గతనెలలో నంబర్‌వన్ స్థానాన్ని సాధించిన సైనా ఆ తర్వాత ఆ స్థానాన్ని కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు నంబర్‌వన్ స్థానం సైనాని వరించి వచ్చింది. తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి చేరుకుంది. పురుషుల బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ నాలుగో స్థానంలో, పారుపల్లి కశ్యప్ 13వ స్థానంలో కొనసాగుతున్నారు.