సాయిపై స్వరూపానంద కామెంట్: షిర్డీలో కేసు

 

సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయనపై షిర్డీలో కేసు నమోదైంది. షిర్డీ సాయిబాబా దేవుడు కానేకాదని, ఆయనను ఎవరూ పూజించరాదని స్వరూపానంద వ్యాఖ్యలు చేయడంతో సాయి భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కొంతమంది భక్తులు హరిద్వార్‌లో స్వరూపానంద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వారణాసిలో శంకరాచార్య దిష్టిబొమ్మను భక్తులు దగ్ధం చేశారు. దీనిపై ఆ వెంటనే స్పందించిన స్వరూపానంద, తానెలాంటి ప్రకటనలు కానీ, ఉద్రిక్తత రేపే వ్యాఖ్యలు గానీ చేయలేదన్నారు. అయినా సరే ఆయన మీద సాయి భక్తులకు ఆగ్రహం తగ్గలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu