కవితను పరామర్శించిన  సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ 

ఓబులాపురం మైనింగ్ స్కాం నిందితురాలైన  బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి , మరో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇవ్వాళ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను క‌లిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌ అయ్యారు. ఆమె యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు తీహార్‌ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ వెళ్లారు. గతంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా క‌విత‌తో ములాఖత్ అయిన విష‌యం తెలిసిందే.ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ క‌లిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖత్‌ అయ్యారు. ఆమె యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఓబుళాపురం గనుల కేటాయింపులో ప్రతిపాదనల ఫైల్‌ను వైఎస్ కేబినెట్ లో  సబిత మంత్రిగా  ఉన్నప్పుడు ఆమోదించారు. ఈ  కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. అందులోని ఇతర అంశాలతో తనకు సంబంధం లేదని  మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఇప్పటికే హైకోర్టుకు నివేదించారు. ఓఎంసీ ఛార్జ్‌షీట్‌లో సబితా ఇంద్రారెడ్డిని మొదట సాక్షిగా చేర్చిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu