సబితపై రాష్ట్రపతికి చెప్తాం మందకృష్ణ

హైదరాబాద్: మంత్రి శంకర్రావుపై దాడి జరిగిన విషయాన్ని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దృష్టికి తీసుకుపోనున్నామని ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. రాష్ట్రపతిని కల్సిన తర్వాత కూడా తగిన చర్యలు లేకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన అన్నారు. హోంమంత్రిగా సబిత ఇంద్రారెడ్డి అనర్హురాలని.. ఆమెను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి దాడి చేసిన వారిపై కేసులు నమోదుకాకుండా హోంమంత్రి స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu