ఘాటు విమర్శల రోజా!

 

వైసీపీలో ఘాటుగా విమర్శలు చేయడంలో మంచి టాలెంట్ వున్న నాయకురాలు రోజా. ఇలా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయో లేదో రోజా అలా చంద్రబాబు మీద ఘాటు విమర్శలు మొదలెట్టేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలన్నీ ఆత్మస్తుతి, పరనిందలా సాగాయని రోజా కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాల్లో చెప్పే మాటలే ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో వల్లె వేశారని తాను తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తాజాగా రైతుల సంక్షేమానికి ఉపయోగ పడే ‘రుణమాఫీ’ పథకం అమలుపై కమిటీ వేయడమేమిటని రోజా లా పాయింట్ లాగారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu