ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

 

కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆటోలో పెట్రోల్ తరలిస్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఆటోలోనిపెట్రోలు చెల్లాచెదురై మంటలు వ్యాపించాయి. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా వున్నారు. మృతులు బెల్లంపల్లి, సోమన్‌పల్లి, పొట్యాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu