విప్లవ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత

 

ప్రముఖ విప్లవ రచయిత.. విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, చలసాని ప్రసాద్ కన్ను మూశారు. ఈ రోజు ఉదయం ఆయన తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. విరసం స్థాపనలో కీలకమైన ముఖ్యపాత్ర వహించిన ఆయన.. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది. చలసాని స్వస్థలం కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు ఆయన వయసు 83 ఏళ్లు. ఆయన మృతికి విరసం సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు