ఓటుకు నోటు.. ఏసీబీ వరుసబెట్టి నోటీసులు

 

ఓటు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు వరుసపెట్టి అందరికీ నోటీసులు జారీ చేసే పనిలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నుండి మొదలు పెట్టి ఈ కేసులో సంబధం ఉందంటూ ఇప్పటివరకూ ఎంతో మందికి నోటీసులు జారీ చేశారు. మొదట టీడీపీ నేతలు సండ్ర వెంకట వీరయ్య.. వేం నాగేందర్ రెడ్డిక నోటీసులు జారీ చేశారు. తరువాత వేం నరేందర్ రెడ్డి కొడుకుకి.. ఆతరువాత కారు డ్రైవర్లకి కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాక రేవంత్‌ రెడ్డి అనుచరులు అల్లూరి నారాయణరాజు, సైదులికి విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యలయంలో వారు విచారణలో పాల్గొన్నారు. సుమారు ఏడు గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ఇంకా కొంతమందికి ఏసీబీ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో సంబంధం ఉన్నా లేకపోయిన అందరినీ వరుసపెట్టి విచారించే పనిలో పడింది.