కేసీఆర్ స్నానం వలన అరిష్టం... రేవంత్ రెడ్డి

 

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అయితే కేసీఆర్ వదిన చనిపోవడం వలన వారి కుటుంబానికి మైల ఉందని అందుకే కేసీఆర్ పుష్కర స్నానం చేయకూడదని వివరించారు. అయినా కేసీఆర్ పుష్కారం చేశారని.. కేసీఆర్ పుష్కర స్నానం చేయడం వలన రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని విమర్శించారు. మైల ఉన్నందున పుష్కర స్నానం చేయోద్దని వేద పండితులు కేసీఆర్ కు చెప్పినా వినకుండా పుష్కరస్నానం చేశారని.. కేసీఆర్ లక్ష పాపాలు చేసి గోదావరి నదిలో ఒక్క మునక మునిగితే ఆ పాపాలన్నీ హరించుకుపోతాయన్న భ్రమలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu