రేవంత్ కు రిమాండ్ పొడిగింపు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి విధించిన కస్టడీ ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇంకా కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి కాలేదని ఇంకా సాక్షులను విచారించాల్సి ఉందని ఇందుకోసం సమయం కావాలని ఏసీబీ అధికారులు కోర్టులో మమో దాఖలు చేశారు. అంతేకాకుండా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా నివేదిక అందలేదని కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో రేవంత్‌తో పాటు మిగిలిన వారి రిమాండ్‌ను కూడా జూన్ 29వ తేది వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu