కాంగ్రెస్కు ప్రశాంత్కిశోర్ సేవలు!.. క్లారిటీ ఇచ్చిన రేవంత్రెడ్డి...
posted on Jul 7, 2021 5:59PM
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. మోస్ట్ డైనమిక్ అండ్ పవర్ఫుల్ లీడర్. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు. కేసీఆర్ను ప్రగతిభవన్ నుంచి బయటకు గుంజగల స్టామినా ఉన్నోడు.
ప్రశాంత్కిశోర్. దేశంలోకే మోస్ట్వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన పని చేస్తే.. పార్టీకి పవర్ పక్కా. ఆనాడు మోదీని గెలిపించారు.. ఆ తర్వాత జగన్ను, మమత బెనర్జీని, స్టాలిన్ను అందలమెక్కించారు. ఇప్పుడు రాహుల్గాంధీని ప్రధాని చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటు రేవంత్రెడ్డి.. అటు ప్రశాంత్కిశోర్.. ఆ ఇద్దరు కలిస్తే..? ఇక తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగుంటుందా? రేవంత్ దూకుడు.. పీకే వ్యూహాలు.. తట్టుకొని.. ఎదుర్కొని.. కేసీఆర్ గెలవగలరా?
అందుకే, రేవంత్రెడ్డికి ఇటీవల అనేక మంది శ్రేయోభిలాషులు ఈ ఉచిత సలహా ఇస్తున్నారట. ప్రశాంత్కిశోర్ను రాజకీయ సలహాదారునిగా నియమించుకోమని చెబుతున్నారట. ఒకరూ, ఇద్దరూ అయితే ఓకే.. చాలా మంది ఇదే మాట పదే పదే చెబుతుండటంతో.. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా తన తొలి ప్రసంగంలో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ రేవంత్రెడ్డి ఏమన్నారంటే...
కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే.. ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని.. పాదరసంలాంటి కార్యకర్తలే తమకు పీకేలు అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే పీకేలు.. ఏకే-47 తూటాలు.. ఇలాంటి కరుడుగట్టిన కార్యదక్షులైన కాంగ్రెస్ శ్రేణులు తనకు అండగా ఉండగా.. పీకే ఎందుకు దండగ.. అన్నట్టు మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. సో.. ప్రశాంత్కిశోర్ అవసరం తనకు లేదని.. తన సత్తా.. కార్యకర్తల కృషి చాలని.. వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలిచేస్తామనే ధీమా రేవంత్రెడ్డిలో మాటల్లో కనిపించింది. మరి, రేవంతా.. మజాకా...