ఆ ముగ్గురి కలయికలో సినిమా చేస్తున్నాం...!

 

కృష్ణవంశీ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ చరణ్ లు కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ చిత్రం నుండి వెంకటేష్ తప్పుకున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలన్నింటికి తెరపడింది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రం గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ..."కృష్ణవంశీ- చరణ్ - వెంకటేష్ కలయికలో సినిమా చేస్తున్నాము. ఆ సినిమాకు నేనే నిర్మాత. ఈ సినిమా కథ విషయంలో ఏర్పడిన అడ్డంకులు అన్నీ కూడా ఇపుడు తొలగిపోయాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.