పేదల కోసం కొత్త పథకాలు.. వెంకయ్యనాయుడు

ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికాలంలో చేపట్టిన కార్యక్రమాలు వాటి విధి విధానాల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, చెప్పే బాధ్యత మాకుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మోడీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడాది అవుతుందని, మోడీ నేతృత్వంలో ఏడాది పాలన చాలా సంతృప్తికరంగా ఉందని, దేశానికి మంచి నాయకత్వం లభించిందని అన్నారు. 2020 నాటికి ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇస్తామని, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu