పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్: 4మృతి

 

 

 

ఢిల్లీ నుంచి డిబ్రుగఢ్ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఈరోజు ఉదయం బీహార్ లోని చప్రా గోల్డెన్ గంజ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైలు పట్టాలు తప్పడంతో 12బోగీలు పడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వేశాఖ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష , స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల పరిహారం చెల్లిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu