ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారు..

 

చాలా రోజుల తరువాత రాహుల్ గాంధీ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సంబరాలను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ... ఏం సాధించారని మీరు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నారో చెప్పండని ప్రశ్నించారు. దేశంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు, సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తూనే ఉన్నారని.. మీరు మాత్రం ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu