మోడీకి అభినందనలు తెలిపిన రాహుల్, సోనియా

 

 

 

ఈ ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి, కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. కొత్త ప్రభుత్వం దేశ సమగ్రతను కాపాడేలా పనిచేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu