పీవీపీకి ముందస్తు బెయిల్‌

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్​ కు తెలంగాణ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ తిమ్మారెడ్డి కిడ్నాప్‌ కేసులో పీవీపీతో పాటు మరికొందరికి ముందస్తు బెయిల్‌ ను మంజూరు చేసింది. ఈ కేసులో నాలుగు వారాల్లోగా జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని హైకోర్టు వారిని ఆదేశించింది.  

గత ఏడాది సెప్టెంబరులో తన భర్తను పీవీపీ మనుషులు కిడ్నాప్‌ చేసి విజయవాడ తీసుకెళ్లారని ఆరోపిస్తూ తిమ్మారెడ్డి భార్య జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీవీపీతో పాటు మరికొందరు తనను కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలు పెట్టారని, అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారంటూ పోలీసులకు తిమ్మారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటనలో పీవీపీతో పాటు మరికొందరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తిమ్మారెడ్డి కిడ్నాప్‌ తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పీవీపీతో పాటు వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తిమ్మారెడ్డిని కిడ్నాప్‌ చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో వారికికి ముందస్తు బెయిల్‌ ను మంజూరు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu