భారత్‌లో 14 లక్షలు దాటిన కరోనా కేసులు.. నాలుగోస్థానంలో ఏపీ

భారత్‌ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 49,931 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 708 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,35,453కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 32,771కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 9,17,568 మంది కోలుకోగా.. ప్రస్తుతం 4,85,114 యాక్టివ్ కేసులున్నాయి.

ఇక కరోనా వ్యాప్తిలో ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానానికి ఎగబాకింది. రాష్ట్రంలో కొత్తగా 7,627 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం 96,298 కేసులతో ఏపీ నాలుగో స్థానానికి వెళ్లింది. దీంతో నాలుగోస్థానంలో ఉన్న కర్ణాటక ఐదోస్థానానికి వచ్చింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, తమిళనాడు రెండోస్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి.