పీవీ కుమారుడు రాజేశ్వరరావు కన్నుమూత

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు, మాజీ ఎంపీ, పీవీ. రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రాజేశ్వరరావు మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఈయన గతంలో కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu