చంద్రబాబు మనుమడిని ముద్దాడిన ప్రధాని నరేంద్ర మోడీ

 

ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన వేదిక వద్దకు చేరుకొన్నారు. మొదట ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరావతి చిత్ర ప్రదర్శను తిలకించారు. ఆ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఉన్న నారా లోకేష్ చేతిలో ఉన్న దేవాన్ష్ తో కాసేపు ముద్దులాడారు. ఆయన తన కళ్ళద్దాలను తీసి ఆ పిల్లాడికి పెట్టి ఆడించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, నారా లోకేష్ దంపతులు కలిసి ఆయనతో ఫోటో దిగారు. తరువాత ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరుండి అమరావతి విశేషాలను, తను దానిని ఏవిధంగా నిర్మించబోతున్నారో వగైరా వివరాలతో కూడిన 3డి చిత్రాలను చూపించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ శంఖుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu