తెలుగుభాషా ప్రచారం ప్రారంభం

Prapancha Telugu Mahasabhalu, telugu mahasabhalu 2012, Prapancha Telugu Mahasabhalu 2012,Telugu Mahasabhalu tirupati

 

నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని మదనపల్లె మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారోత్సవాలు ఆడంబరంగా ప్రారంభించారు. ఎంపీడీవో గంగయ్య, తహసీల్దార్ అమరేంద్రబాబుల ఆధ్వర్యంలో మండలంలోని 16 గ్రామపంచాయతీల్లో విద్యార్థులచే ర్యాలీలు నిర్వహించారు. పొన్నూటిపాళెం పంచాయతీ కురవంకలో ఎంపీడీవో గంగయ్య, వీడీసీ మాజీ చైర్మన్ పి.చలపతి, కార్యదర్శి పవన్‌కుమార్, వలసపల్లెలో తహసీల్దార్ అమరేంద్రబాబు, పోతబోలు, చీకిలబైలులో ఆర్ఐలు నవీన్, సయీద్, వీఆర్వోలు ముజీబ్, సుబ్బారెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చైతన్యభారతి, విజయభారతి స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu