కేసిఆర్ సర్కార్ విఫలమైంది

టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శలు సంధించారు. అధికారంలోకి రాకముందు ఎలాంటి హామీలిచ్చారని..హామీలను అమలు చేసే విధంగా టి.సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. కొండ నాలికకు ముందులేస్తే ఉన్న నాలిక ఊడిపోయిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు రావాల్సిన వాటాపై ఎందుకు స్పందించడం లేదని, న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించడం లేదని ప్రశ్నించారు. నీరజా మాథుర్ కమిటీ ఎదుట వాదనలు ఎందుకు వినిపించలేదని, న్యాయస్థానాలు, కేంద్ర విద్యుత్ మంత్రి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రిలను ఎందుకు కలవలేదన్నారు. కనీసం అఖిలపక్షానైనా ఎందుకు తీసుకెళ్లడం లేదని పొన్నాల పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu