దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఎవరంటే...

 

దేశం మొత్తాన్ని కదిలించిన దిశ లాంటి కేసుల్లోని నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే అది పోలీస్ కమిషనర్ స్థాయిలోనో... లేక పోలీస్ బాస్ డీజీపీ పరిధిలోనో తీసుకునే పరిస్థితి లేదనే చెప్పాలి... ఎందుకంటే... దిశ హత్యాచార ఘటన బయటికి వచ్చిన తర్వాత ముందు పోలీసులపైనా... ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి... ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా జాతీయ మీడియా నుంచి చేదు అనుభవం ఎదురైంది... ఇలాంటి పరిస్థితుల్లో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే సాధారణ విషయం కాదు... ఏదైనా తేడా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది... అందుకే ఇలాంటి కేసుల్లో పోలీస్ బాస్ లు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సాహసం చేయనే చేయరు... వరంగల్ స్వప్నిక నిందితుల ఎన్ కౌంటరైనా... ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటరైనా... ప్రభుత్వ అనుమతి లేనిదే చేయలేరు... ఎందుకంటే, సీన్ రీకన్ స్ట్రక్చన్.. నిందితుల తిరుగుబాటు పేరుతో.. పోలీసులు ఎన్ని మాటలు చెప్పినా... ఇలాంటి ఎన్ కౌంటర్లు ప్రీప్లాన్డ్ గానే ఉంటాయనేది మానవ హక్కుల నేతల ఆరోపణ... అందుకే, దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను అధిక శాతం స్వాగతిస్తుంటే... వ్యతిరేకిస్తున్నవాళ్లూ ఉన్నారు... పైగా నిందితులను ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నవాళ్లు చిన్నవాళ్లేమీ లేదు... ఇక, రేపిస్టులను ఉరి తీయాల్సిందేనంటున్న మహిళా ప్రముఖులు కూడా అది చట్ట ప్రకారం... న్యాయ వ్యవస్థ జరగాలని అంటున్నారు.... అందుకే, ఇలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ లాంటి కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే కత్తి మీద సామే. అయితే, ఇలాంటి ఎన్ కౌంటర్ల తర్వాత పోలీసులపై ప్రజలకు అంతోఇంతో నమ్మకం కలుగుతుంది. పోలీసులను ప్రజలు హీరోలుగా కీర్తిస్తారు. దిశ ఎన్ కౌంటర్ తర్వాత అదే జరుగుతుంది. అయితే, ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం ఏడుగురు పోలీసులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు ఉన్నారు. అయితే, దిశ కేసును మొదట్నుంచీ డీసీపీ పర్యవేక్షిస్తున్నా... అతను ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారో లేదో తెలియదు.