చటాన్ పల్లి ఎన్ కౌంటర్లో ఎస్సై... కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు

 

శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5:45 నుంచి 6:15 మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కోర్టు అనుమతితో డిసెంబర్ 4న చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకుని కేసు విచారణ చేపట్టామని, అయితే... సీన్ రీ-కన్ స్ట్రక్చన్లో భాగంగా క్రైమ్ స్పాట్ కి నిందితులను తీసుకురాగా... ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పోలీసులపై దాడి చేశాడని... ఆ తర్వాత మరో నిందితుడు చెన్నకేశవులు కూడా అటాక్ కి దిగాడని సీపీ తెలిపారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడమే కాకుండా... గన్స్ లాక్కుని కాల్పులు జరిపారని... లొంగిపోవాలని కోరినా వినలేదని... దాంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని... ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత నిందితుల వైపు నుంచి ఫైరింగ్ ఆగిపోయిందని... స్పాట్ ని పరిశీలిస్తే... నిందితులు నలుగురూ చనిపోయి కనిపించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే, నిందితుల దాడిలో ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని, వాళ్లిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ జరిగినప్పుడు మొత్తం 10మంది పోలీసులు ఉన్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు.