మద్యం తాగనివ్వలేదని.. భార్యని చంపిన పోలీస్ అధికారి

 

మద్యం తాగనివ్వలేదని తన భార్యను చంపి.. తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో పూల్ సింగ్ యాదవ్, గీతాదేవి భార్య భర్తలు. పూల్ సింగ్ యాదవ్ రాజస్థాన్ సీఎం భద్రతా సిబ్బందిలో ఎఎస్సై స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే తనను మద్యం తాగనివ్వలేదని పూల్ సింగ్ యాదవ్ భార్యతో వివాదానికి దిగాడు.. అనంతరం కోపంతో రివాల్వర్ తో కాల్చి చంపాడు. తరువాత అల్వార్ జిల్లాలోని ఖైర్‌తాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి కొద్ది సేపు స్టేషన్‌లో కూర్చుని ఇవాళ ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫూల్‌చంద్ యాదవ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu