గవర్నర్ ని కలిసిన టి -టిడిపి ఫోరం నేతలు

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల అక్రమాల్లో టిఆర్‌ఎస్‌, సీఎంవోల పాత్ర ఉందని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ టిడిపి ఫోరం గవర్నర్‌ను కోరింది. పోలవరం టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ టిడిపి ఫోరం నేతలు చెప్పారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌ జోక్యం చేసుకోకపోతే హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని టి. టిడిపి ఫోరం నేతలు తెలిపారు. తెలంగాణ సాధన పేరిట అమ్ముడుపోయే వారెవరో బయటకు రావాలన్నారు. ఓవైపు కాంగ్రెస్‌తో, మరోవైపు జగన్‌తో కుమ్మక్కవుతున్న దెవరో త్వరలోనే బయటపడుతుందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu