అవిశ్వాసం పెట్టడం ఖాయం టిడిపి

హైదరాబాద్‌: రైతుల సమస్యలపై అవిశ్వాసం పెట్టడం ఖాయమని టిడిపి స్పష్టం చేసింది. తమ గురించి మాట్లాడే కేసీఆర్‌, జగన్‌లు గవర్నర్‌ను కలిసి సర్కారు మైనార్టీలో పడింది బలనిరూపణకు ఆదేశించమని కోరతారా అని సవాలు విసిరారు. అవిశ్వాసంపై కేసీఆర్‌ ఓవైపుతమపై సవాళ్లు విసురుతూ మరోవైపు కాంగ్రెస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అవుతున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్‌కు కష్టమొచ్చినప్పుడల్లా కేసీఆర్‌ ఆదుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేవలం కేసీఆర్‌కే దక్కిందని విమర్శించారు. కేసీఆర్‌ అవకాశం వచ్చినప్పుడల్లా మళ్లీ కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలను అమ్ముకునే అవకావం ఉందని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu