రామోజీరావును పొగిడిన ప్రధాని

 

'ఈనాడు' 'ఈటీవీ' సహా రామోజీ గ్రూపు సంస్థలన్నీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రామోజీరావుకు ఓ లేఖ రాసారు. తాను ఇచ్చిన 'స్వచ్ఛభారత్' అభియాన్ పిలుపునందుకొని, స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ప్రజలలో శుభ్రత గురించి విస్తృత స్థాయిలో స్ఫూర్తి తెచ్చేందుకు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పరిశుభ్రమైన భారత్ ను సాధించాలంటే ఒక్క వ్యక్తి వల్ల అయ్యే పని కాదని, అందరు కలిసి చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఇందుకు రామోజీరావు గ్రూపు సంస్థల సభ్యులందరూ, రామోజీరావు చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇలాగే తమ ప్రోత్సాహాన్ని కొనసాగించాలని ప్రధాని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu