మోడీకి కుష్బూ సలహా...

 

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నసంగతి తెలిసిందే. దీంతో ప్రధాని పైనా... ప్రధాని తీసుకున్న నిర్ణయంపైనా పలువురు విమర్శలు చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా.. నటి ఖుష్బూ మోడీకి ఓ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చెన్నైలో నిర్వ‌హించిన‌ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌ధాని మోదీ ఏటీఎం సెంట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ఆమె సూచించారు. ప్ర‌ధాని మోదీ మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జ‌నాలు ఆయనను నమ్ముతారా? అని ప్ర‌శ్నించారు. మోదీ విధానాల‌తో దేశ‌ ప్రజలంతా ఎన్నో క‌ష్టాలు ఎదుర్కుంటున్నార‌ని, వారి ఇబ్బందుల‌ను ప్ర‌ధాని అర్థం చేసుకోవాలని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల ర‌ద్దు చేసేముందు ముందస్తు జాగ్ర‌త్త‌లు తీసుకోకపోవ‌డంతో మోదీపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నార‌ని ఆమె అన్నారు.