మోడీ వియాత్నం పర్యటన.. 12 కీలక ఒప్పందాలు..


 

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం వియాత్నం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మోడీ పలు అంశాలపై చర్చలు జరిపి ఒప్పందాలు జరిపినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి వియాత్నం చేరుకున్న మోడీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం.. ఆదేశ ప్రధానితో చర్చలు జరిపారు. ఈనేపధ్యంలో భారత్‌-వియత్నాం మధ్య 12 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. వియత్నాంతో ఒప్పందం వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందని..  ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని.. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని తెలిపారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu