మోడీ విద్యార్హతలపై డౌట్ క్లియర్.. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు..

 

ప్రధాని నేరంద్ర మోడీ విద్యార్హతలు ఏంటో తెలియజేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాచార కమిషనర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారో లేదో తెలియదు కాని..  గుజరాత్ కు చెందిన 'అహ్మదాబాద్ మిర్రర్' పత్రిక మోదీ విద్యార్హతల వివరాలను బయటపెట్టింది. ఆయన విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారని, ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారని తెలిపింది. 1983లో 62.3 శాతం మార్కులతో పట్టాను పొందారని వివరించింది. ఆయన చదువుకుంటున్న సమయంలోనే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ చేస్తున్నారని, వీరిద్దరి రోల్ నెంబర్ 71 అని పేర్కొంది. మరి కేజ్రీవాల్ గారికి  ఈ వివరాలు సరిపోతాయో లేదో చూడాలి మరి.