ఆ 40మంది ఎంపీలూ...కుట్ర చేస్తున్నారు



 

400మంది ఎంపీలు దేశాభివృద్ధి కోసం పరితపిస్తుంటే, ఓ 40మంది ఎంపీలు మాత్రం కుట్ర చేస్తున్నారంటూ నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలుచేశారు. బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ నిప్పులు చెరిగిన మోడీ...దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రజాసమస్యలను చర్చించకుండా తమ గొంతు నొక్కితే, జనసభకు (జనాల్లోకి) వెళ్తామని, ఇది రాజ్యసభ కంటే పెద్ద సభ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అహంకారంతో ప్రవర్తిస్తున్నారని మోడీ మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఆయన, ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్ లో కూడా కాంగ్రెస్ ను క్షమించరని హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu