త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
posted on May 11, 2025 12:08PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు పాకిస్థాన్తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్-పాక్లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది.