భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు

 

పెట్రోలియం సంస్థలు నిన్న అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెంచేశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో తప్పని సరి పరిస్థితులలోనే ధరలు పెంచవలసి వచ్చిందని చెపుతున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.3.96, డీజిల్ పై లీటరుకు రూ.2.37 చొప్పున ధరలు పెరిగాయి. దేశంలో మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎంట్రీ టాక్సుల భారం మోస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మరియు సరుకు రవాణా వాహనదారులకు ఇది మోయాలని భారం అవుతుంది. అంతిమంగా ఆ భారం తిరిగి సామాన్య ప్రజలపైనే పడుతుంది. గత ఆరేడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గు ముఖం పట్టడంతో గత ఆగస్ట్ నెల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పెట్రోల్ ధర రూ. 17.11, డీజిల్ ధర రూ. 12.96 తగ్గింది. కానీ ఇప్పుడు ఒకేసారి ఏకంగా పెట్రోల్ ధర రూ.4, డీజిల్ ధర రూ.3 పెరిగిపోయింది. ఒకేసారి ఇంత భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు చూసి సామాన్య పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu