ప్రజలే బుద్ధి చెబుతారు.. పత్తిపాటి
posted on Jul 23, 2015 6:27PM

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ పై విమర్శలు చేశారు. దొంగ యాత్రలతో ప్రజలను మోసం చేయాలనుకుంటే కుదరదని.. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని, కానీ అభివృద్ధికి అడ్డుపడిడాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక.. ఏం చేయాలో తెలీక ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని.. తమ తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకటిగా ఉన్నరాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఎవరూ నమ్మె స్థితిలో లేరని ఎద్దేవ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని.. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే తమకు పార్టీకి పుట్టగతులు ఉండవనే భయంతో దానిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.