పారిస్ దాడిపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు..జల్సాలు చేసినపుడు తెలియలేదా?

 

ఈ మధ్య ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వార్తల్లో నిలవడం రాజకీయ నేతలకు పరిపాటైపోయింది. ఒకపక్క పారిస్ లో ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించగా అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే ఇప్పుడు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్ దేశాల్లో ఉన్న చమురు నిల్వలు దోచుకొని.. ఆ దేశాల్లోని చమురు క్షేత్రాలను ఆక్రమించి.. ఆ డబ్బుతో పారిస్‌లో జల్సాలు చేసిన రోజున, ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదా? అని ఆజంఖాన్ ప్రశ్నించారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు చేసిన చర్యలకు ప్రతిఫలమే పారిస్ లో ఉగ్రవాదుల దాడి అని.. ఇప్పుడైనా అగ్రరాజ్యం ఈ చర్యలను గుర్తించాలని అన్నారు. ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. వేలమంది నిరాశ్రయులను చేసింది. దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని ఆజంఖాన్ పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu