పాలేరు ఉపఎన్నికలో ఉద్రిక్తత... కొట్టుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్

 

ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్లో ఉద్తికత వాతావరణం నెలకొంది. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మరో ప్రాంతంలో టీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తల మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరు వర్గాల కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక ఖరారైన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu