ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
posted on May 11, 2025 1:24PM

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నాది. తమకు ఇచ్చిన పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారాలు ఊహాగానాలను నమ్మొద్దని కోరింది. భారత్-పాక్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీ తన నివాసంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు పాకిస్థాన్తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.