బీఆర్ఎస్ గూటికి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తన తనయుడు  శిశిర్‌ గమాంగ్‌  తో కలిసి శుక్రవారం (జనవరి 27) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆయన రెండు రోజుల కిందట బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి విదితమే.

 బీఆర్‌ఎస్‌  అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  గిరిధర్‌ గమాంగ్‌, శిశిర్ గమాంగ్ అలాగే   కోరాపుట్‌ మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.  కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన గిరిధర్ గమాంగ్ కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన సంగతి విదితమే. ప్రగతి భవన్ లో జరిగిన ఈ భేటీలో   గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు. అప్పటి నుంచీ గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జరుగోతోంది.  

వీరిరువూ బీఆర్ఎస్ లో నేడు చేరనుండటంతో ఆ ప్రాచారం వాస్తవమేనని తేలింది. బీఆర్ఎస్ లో చేరేందుకు ఒడిశా నుంచి హైదరాబాద్ చేరుకున్న గిరిధర్ గమాండ్.. మరి కొద్ది సేపటిలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టమెంటరీ సమావేశం జరుగుతోందనీ, ఆ సమావేశం పూర్తి కాగానే కేసీఆర్ వీరిరువురికీ గులాబీ కండువా కప్పుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన  నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్  బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇంతకీ ఈ గిరిధర్ గమాంగ ఎవరంటే..  1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన  ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. ఈయన 9 సార్లు పార్లమెంటుకు ఎన్నియ్యారు.

కాగా, గమాంగ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే  వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒ ఒక్క వోటు కారణంగానే  నాటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ  తరువాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యారు. తన కుమారుడికి కాంగ్రెస్ తగు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోిస్తూ.. 2015లో బీజేపీ గూటికి చేరారు.