ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల 

 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మరోసారి ఊపందుకోనుంది . ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో నాగార్జున సాగర్ నియోజక వర్గంలో ఉపఎన్నిక త్వరలో జరగనుంది. అంతలోనే ఏపీ, తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు. ఇక మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu