ఏపీలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం..

 

నెల్లూరు జిల్లాలో 30 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది బ్రెజిల్ లోని రియోడిజినెరోలో ఉన్న విగ్రహం తరహాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అతి పెద్ద ఏసుక్రీస్తు విగ్రహం కావడం విశేషం. ఈ విగ్రహాన్ని వైఎంసీఏ మైదాన ప్రాంగణంలో వీఆర్ పీజీ కళాశాల ముందు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఫైబర్ తో తయారుచేసిన ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. గుడ్ ఫ్రైడే కానుకగా క్ర్తైస్తవుల కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ శాసనసభ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. బ్రెజిల్ లో ఉన్న ఏసు ప్రభువును చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహం తయారీకి 15 లక్షల వరకు ఖర్చయిందని ఆనం తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu